Saturday, 4 June 2011

మన జీవనం

నిన్నటి జ్ఞాపకాల కలలో లీనమైతే
రేపటి దిక్కుగా నీ ప్రస్థానం సాగదుగా

అపజయాలెన్నో అడియాసలు రేపినా
నడిచే జీవితం అడుగైనా ఆగదుగా

పుట్టే పొద్దుకు కన్నులు స్వాగత పత్రాలని
చీకటి వెన్నెలలో కలలు కనటం మానుతామా

సృష్టి నాడిలో అనుక్షణం చావు చప్పుడున్నదని
తల్లి బిడ్డకి జన్మనివ్వటం ఆపుతుందా

పెను తుఫానుల అలలను తిప్పికోట్టినప్పుడే
నేల తల్లి తీరం స్థిరంగా నిలిచేది

గొంతు ముగాపోయిందని భావాలు ముతపడవు
నరాల రెక్కలతో విహంగ విన్యాసం చేస్తాయి

నీ ప్రాణానికి కదలిక ఆగిపోయిందని
ఉదయించిన నీ ఆశాజ్యోతులు ఉరకలేయ్యటం ఆపుతాయా

ఆశల తెరల మధ్య నిరాశల పొరల మధ్య
సాగే సుఖదుఖాల తరంగాలే మన జీవన ప్రవాహం

ప్రస్థానంకి ఎప్పుడు ముందు చూపే,
జ్ఞాపకానికి మాత్రం వెనక
తల్లి కడుపులోకి మళ్ళీ పోలేంగా
కానీ ఆ పేగు బంధం ఈ పెగుతో పెనవేసుకుని పోతుంది
విశ్వ యవనికతో భూమి శృతి కలిపినట్లు

Sunday, 9 January 2011

The Unsung Scientist of the Nation, Satyen Bose


Brief Bio:


A Fellow of the Royal Society, he was awarded India's second highest civilian award, the Padma Vibhushan in 1954 by the Government of India. In 1937, Rabindranath Tagore dedicated his only book on science, Visva-Parichay, to Satyendra Nath Bose. He was honored with title Padma Vibhushan by the Indian Government in 1954. In 1959, he was appointed as the National Professor, the highest honor in the country for a scholar, which he held for 15 years. In 1986 S.N. Bose National Centre for Basic Sciences was established by an act of Parliament, Government of India, in Salt Lake, Calcutta in honour of this world renowned Indian scientist.

He was the President of Indian Physical Society and the National Institute of Science. He was elected General President of the Indian Science Congress. He was the Vice President and then President of Indian Statistical Institute. He was also nominated as member of Rajya Sabha. 



Untold History


When his meticulously researched paper sent for publication was returned by the Philosophical Magazine from London with not-so-flattering remarks, Satyendranath Bose did not lose heart. He was so sure of his finding. This was in 1924. 

Born on January 1, 1894, Bose studied in Calcutta and was brilliant in his studies. His classmate was the other great (also forgotten) Meghnad Saha, and the legendary Jagdish Chandra Bose was his teacher. 

At 22, Bose was appointed lecturer in Calcutta University, along with Saha. In 1921, he joined the then newly created Dacca University as Reader in Physics. He had a couple of papers published by the same journal earlier, co-authored with Saha. It was here while teaching that he wrote this paper for deriving the Planck's Law. His paper was titled ‘Planck's Law and Light Quantum Hypothesis.'

Golden period


The early decades of 1900 were a golden period in the growth of science. It was teeming with great scientists in the western world competing with one another creditably. This was the period when classical sciences such as physics, chemistry, astronomy and medicine were outpacing one another, despite little and inefficient communication. The Moore's law of today would pale into insignificance if we apply it to that period.

In 1900, Max Planck explained in the theory of black body radiation that light is emitted in discrete amounts (quanta) rather than as a continuous wave. But his derivation of this formula was not satisfactory to other scientists, in fact even to himself. However, his formula held true to everyone's surprise.

Albert Einstein's Nobel Prize-winning paper explained the photoelectric effect based on Planck's quanta as photons in 1905. (Einstein was awarded the Nobel Prize for this paper, not for his papers on Relativity!) But many of his colleagues were not fully convinced of his yet-to-be-developed photon theory. The world was waiting for a new theory on fundamental particles to fill the gaps.

Under these circumstances, Bose re-sent the paper to Albert Einstein in June 1924, with a fervent appeal for his perusal and opinion. “Though a complete stranger to you, I do not feel any hesitation in making such a request,” he wrote. (He was being modest; he had earlier translated Einstein's Relativity papers into English with Einstein's permission). Little could he have foreseen the impact this was going to have.

Einstein immediately recognised the significance of this paper. This paper was going to substantiate and revolutionise his theory of photoelectric effect. Einstein himself translated Bose's paper into German and sent it to Zeitschrift für Physik with his endorsement for publication. With his demigod status, Einstein's words carried much weight. It was promptly published, and immediately Bose shot into prominence.

Seminal phenomenon

Einstein personally invited Bose to work with him, and their efforts culminated in the Bose-Einstein statistics, an important and seminal phenomenon in quantum physics.

His work was wholeheartedly supported and appreciated by the leading lights in quantum theory, such as Louise de Broglie, Erwin Schroedinger, Paul Dirac and Heisenburg.

In honour of Bose' (and every Indian), Paul Dirac coined the word ‘Boson' for those particles which obey Bose's statistics. In atomic theory, only Fermions (named after Enrico Fermi) and Bosons were named after physicists. What a wonderful distinction conferred on our great scientist.

He was awarded the Padma Vibhushan in 1954 — and forgotten afterwards.

This is not intended to be a scientific article, but a grim reminder of our apathy to our eminent scientists who had toiled with great shortcomings, yet came out with flying colours. J.C. Bose, P.C. Ray, M. Saha, C.V. Raman and countless other yesteryear scientists, who had achieved so much, were acclaimed internationally, yet ignored and were in oblivion at home.

Is it not a shame that Bose is known more to westerners (even now) than to Indians? How many of us are aware of his communication to Einstein and the subsequent events. It is perplexing why this little incident of Bose sending his paper to Einstein has not found a place in our school books! 

We overlook scientists and their achievements. Yet we don't fail to adulate and elevate Tendulkars, A.R. Rahmans, Kamal Hasans and Khans for their achievements on the screen/ in entertainment. No complaints. Just why don't we extend this courtesy to our real achievers? 
We, Indians, are blessed with many festivals to celebrate. Quite a few are new years! Apart from January 1, we have many new years, Assamese, Bengali, Marathi, Tamil, Telugu, etc. Of these, we chose unanimously to celebrate the astronomically insignificant date of January 1 as our own, and bash up our streets with unrestrained celebration with booze, dance and gaiety.

Why cannot January 1, birthday of Satyendranath Bose, be celebrated also as a National Scientist Day? Our National Science Day falls on February 28 in remembrance of the Raman Effect. 

In his book, The Scientific Edge, the noted physicist Jayant Narlikar observed:
S. N. Bose’s work on particle statistics (c. 1922), which clarified the behaviour of photonsparticles of light in an enclosure) and opened the door to new ideas on statistics of Microsystems that obey the rules of quantum theory, was one of the top ten achievements of 20th century Indian science an (the d could be considered in the Nobel Prize class.

Tuesday, 14 September 2010

లాల్ సలాం లాల్ సలాం

లాల్  సలాం అంటే చాలా మంది అదేదో (కేవలం) నక్షలైట్లకు, అతి వాదులకు సంబందించిన నినాదం గా పరిగనిస్తారు... 
ఎరుపు లో తల్లి నుదిటి మీద వుండే సింధూరం లాంటి అమ్మ తనం వుట్టి పడతది, (రక్త సంబంధం లాంటి) అన్నలక్కల ఆప్యాయత కనపడ్తడి. పురోహితుడు పెట్టె తిలకం లో ఉన్న రక్షణ లాంటిది .. సూర్యుడు పొద్దున్న పొడిసే వెలుగు లాంటిది... మరి ఎందుకురా ఎరుపంటే భయం?
--------------------------------------------------------------------------
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం
లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం

అడవి కొరకు భూమి కొరకు పీడుతుల విముక్తి కొరకు
సాగే ప్రతి లాడాయిలో సాహసులై పోరాడిన
వీరులారా శూరులార ఉద్యమ యోదుల్లార
అందుకోండి కోట్లాది శ్రమ జీవుల లాల్ సలాం

|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
కారాపు నీళ్ళు జల్లి వడిసేటి రాళ్ళు విసిరి
రజాకార్ల నెదిరించిన మన బిడ్డ రావి నారాయణ
అన్నా రావన్న అందుకో లాల్ సలాం

|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||

కొలువు కొరకు విలువ కొరకు తెలంగాణ తల్లి కొరకు
నడిచిన స్వరాష్ట్ర పోరులో తూటాలకు బలి అయిన
వీరులారా ధీరులారా విద్యార్ది అమరులార
అందుకోండి నేటి తరం యువకులా లాల్ సలాం

|| లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం ||

Thursday, 9 September 2010

Remembering 'Praja Kavi' Padma Vibhushan Kaloji

 

తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది. మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్ల పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులకి అనువదించిండు. కాళోజి కథలు, నా గొడవ, జీవన గీత మొదలైనవి ఆయన రచనలు. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం, రాజకీయాలు ఆయన ప్రాణం. ఆర్యసమాజ భావజాలం పట్ల ఆకర్షితులై నిజాం నవాబు కారుమీద బాంబు విసిరాడు. 

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నారు. రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు.పి.వి. నరసింహారావు, కాళోజీ ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు. విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు. అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు. 2002 నవంబరు పదమూడో తేదీ కాళోజీ కన్నుమూశారు!



కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టారు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా-కాళోజీ
  
ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి

'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిది --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి

" ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. " - కాళోజీ

Thursday, 2 September 2010

Tribute To K Balagopal -- Human Rights Champion The Legend Of India

To remember K Balagopal now is only to remember our own humanness and the conditions under which we struggle for a better life for everyone.

K Balagopal’s role as a civil liberties and democratic rights activist had two phases – the first, when the opening sentence of the Communist Manifesto and Marx’s last thesis on Feuerbach guided his life’s activity, and the second, when, even as he gave up on these precepts, he continued in the tradition of practical humanism.

This was my humble effort for the lengend of India:



ప్రజల మనిషి..హక్కుల నేత.. బాలగోపాల్ అమర్ రహే
ఏడాది క్రితం...

మనిషికి ఒక తోడు పోయింది
మనిషికి ఒక నీడ పోయింది
కన్నీళ్లు తుడిచే స్నేహ హస్తం కను మరుగైంది
ఒక భరోసా గళం మూగ పోయింది

హక్కుల గీతం ఆగిపోయింది
పోరాట దీపం ఆరిపోయింది
విలువల గొంతు మూగపోయింది

రక్తమోడిపే రాజ్యంతో రాజీ పడకుండా
రాజ్య హింసకు, ఉద్యమ హింసకు ఎదురీడి పోరాడిన
ఆజాన బాహుడు మన బాల గోపాలుడు

ప్రజల పక్షపాతి గుండె చప్పుడు ఆగినా
ఆయన ఆశయాలు దేశాలెల్ల మోగెను
మన కలల పంట నేల రాలినా
అది మొలకలెత్తి వేల వేల రాశులవునులె







Tuesday, 17 August 2010

'అభివృద్ధి' ఉన్మాదులు

'అభివృద్ధి' ఉన్మాదులు

ఆ రోజు జూలై 14 దోస్తుల్తో సెలవుల మీద అమెరికా లోని కాలిఫోర్నియా లో ఉన్నా. పొద్దున్న లేవంగనే కొద్ది సేపు మన వార్తలు చదువుదామని ఆన్ లైన్ లో పేపర్ చూశ్న. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని పచ్చని పొలాల్లో ఎర్ర మల్లెలు నేల రాలాయి, రాజ్య హింస తూటాలకు మరి కొంత మంది బలి అయ్యిన్రు. అన్ని పేపర్లలో, న్యూస్ చానల్స్ లో అమాయకులు చనిపోయారు అని హెడ్ లైన్స్ రాసిన్రు, కానీ నా దృష్టిలో వాళ్ళను అమాయకులు అంటే వాళ్ళ త్యాగాలను ధైర్యాన్ని అవమానపర్చినట్లే. అమాయకులు కాదు కాబట్టే ఖాకీల బూట్ల చప్పుళ్ళకు ఏ మాత్రం జంకకుండా, పెత్తందార్ల గడీలు కూల్చనీకి ఉత్త చేతులతో చీమలదండులాగా బయలుదేరి, ఆయుధాలు పట్టిన పోలీసులనే తరిమిన మండే నిప్పు కణాలు, త్యాగాల బిడ్డలు, మరణమంటే త్రున ప్రాయమనే విప్లవాల వీర శహీదులు. మన ''ప్రజాస్వామ్యిక దేశంలో'' ఇలాంటి ఎర్ర మల్లెలు ఎన్నో నేల రాలాయి, ఇలాంటి పూలని రాజ్యం ఎంత కోసే కొద్ది అంతకంత పూస్తనె ఉన్నయ్, తుది మొదలు తేడ లేకుండా ఈ మల్లెల తీగలు చిదిమేకొద్ది ఎదుగుతూనే ఉన్నాయ్.

ఏమని చెప్పాలి, ఎక్కడని చెప్పాలి..ఒక ప్రాంతం లేదు..ఒక రాష్ట్రం లేదు..ఒక భాష అంటూ భేదం లేదు..బలహీనుల్ని దోచుకోటంలో మాత్రం మన దేశంలో బలవంతుల మద్య సమైక్యత బాగా కనపడతది. ఒక సింగూర్, పోలేపల్లి, నందిగ్రామ్, బయ్యారం, నానక్ రాం గూడ, దంతేవాడ, చిలమత్తూర్....నేడు సోంపేట...రేపు మహబూబ్ నగర్ లోని హిందూపూర్ కావొచ్చు..ఇలా రాసుకుంటే పోతే రామాయణం, వింటూ పోతే మహాభారతం అంత పెద్దగా అనిపిస్తది మనకి... పల్లెల పేర్లే మారుతాయి ఒక దగ్గర గని అయితే మరోదిక్కు ప్రత్యేక ఆర్ధిక మండలి (SEZ) ఇంకో దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం... అన్నీ 'అభివృద్ధి' పేరు మీద సామాన్య ప్రజల పై జరుగుతున్న ఉన్మాద చర్యలే. ఒక్కో సారి వినటానికి ఎంత చిత్రంగా ఉంటుంది అంటే...అత్యంత వెనుకపడ్డ జిల్లాగా పేర్కొనబడే శ్రీకాకుళం 'అభివృద్ధి' లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు సిద్దం అవుతుంది.. మరి మనందరికీ 20 కి పైగా తెలుగు న్యూస్ చానెల్స్ ఉండి కుడా ఈ విషయం తెలియకపోవటం ఏందా అని అనుకుంటున్రా ? ఈ విషయం లో సోంపేట రైతులు మాత్రం మస్తుగా స్పందించిన్రు, పోలీసులతో సమానంగా మన మీడియా మిత్రులను కూడా ఉరికిన్చుకుంటూ చెప్పులతో దేహ శుద్ధి చేసిన్రు.. ఇక మన గిన్నిస్ బుక్ రికార్డ్ విషయాల్లోకి వెళ్తే, బహుశా ప్రపంచం లో ఎక్కడా లేని విద్యుత్ ప్లాంట్లు శ్రీకాకుళం లో ఉన్నాయ్:

రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం,
ఎచ్చెర్ల దగ్గర వరం పవర్ ప్రోజెక్ట్
సంతబొమ్మాళి మండలంలో ఈస్టుకోస్టు ఎనర్జీ
సూర్యచక్ర థర్మల్‌ ఎనర్జీ
మేఘవరం ఎనర్జీ
సోంపేట మండలంలోని బీల భూముల వద్ద నాగార్జున ఎనర్జీ
రణస్థలం మండలంలో ఆశ్రిత ఎనర్జీ
కంచిలి మండలంలో నమ్రత ఎనర్జీ సంస్థ
కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం

శ్రీకాకుళం జిల్లాలో ఇంత “అభివృద్ధి” జరుపుతున్నామని మన ప్రభుత్వం అనగానే, ఈ పెట్టుబడిదార్లకు మన మీడియా వంత పాడటం, దానికి మన మధ్య, ఎగువ తరగుతుల యువకులం “భలే భలే” అంటూ ఏ మాత్రం సామాన్య ప్రజల అవసరాన్ని గుర్తించకుండా ఇటువంటి అర్ద రహిత అభివృద్ధి నమూనాలను నమ్ముతున్నాం (అయినా మనకు కావాల్సింది ఇండియన్ ఐడల్ లో మనం SMS పంపినోడు గెలిచిండా లేదా.. డీ, ఆట ల్లో ఏ పోరి స్టెప్పులు బాగా ఏస్తుంది లాంటి విషయాలు అంటారా ?). మన  కళ్ళన్నీ ఇలా పల్లకి ఎక్కే క్షణాల కోసం మాత్రమే చూస్తు, బలయ్యే సామాన్యుల కష్టాలు “అనాగరికంగా”, వాళ్ళ పోరాటాలు “నక్సలిజంగా” చాలా కన్వీనియంట్గా పేర్లు పెట్టి, ఈ దారుణాల్ని మహదర్జాగా ఎంజాయ్ చేస్తే, రేపు 'అభివృద్ధి' పేరు మీద మన ఇంటిని కుడా కబలిస్తారు.

ఈ విద్యుత్ కేంద్రాలకు, గనుల పరిశ్రమలకు, చౌకగా బాగా ఎక్కువ విస్తీర్ణపు భూములు, అధిక మొత్తంలో నీరు కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల జరిగే ప్రత్యక్ష, పరోక్ష నష్టాలు తెలిసి ఉద్యమించని అమాయక ప్రజలు కావాలి. సోంపేట మండలంలో ఇప్పుడు నాగార్జున కంపెని వారు థర్మల్ పవర్ ప్లాంటు పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్థలంలో ఒక పెద్ద నీటి మడుగు ఉంది. దీన్ని స్థానికులు “బీల” అంటారు. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ బీల  చుట్టుపక్కల రైతులకు, మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం. అయితే మన ప్రభుత్వ పెద్దలకు ఈ బీల “పనికిరాని భూమి” కింద కనపడింది. ఇంకేం మన పాలకులు ఈ గుత్తేదార్ల అడుగులకు మడుగులు వత్తింది. ఒక్క సారి ఈ థర్మల్ ప్లాంటు నిర్మాణం అయితే 30 గ్రామాల ప్రజలకు కల్పతరువులా ఉన్న బీల అదృశ్యం అవుతుంది. పెద్ద మోతాదులో విడుదలయ్యే సల్ఫర్‌ డై ఆక్సై డ్‌ గురించి, మెర్క్యురీ గురించి, సాలీనా ఆ ప్లాంటు విసర్జించబోయే 50 లక్షల టన్నుల బూడిద గురించి, వీటి వల్ల రాగ ల రోగాల గురించి ఎవరు ఏమీ మాట్లాడరు. పంపింగ్‌ కారణంగా జరిగే నిరంతర సాగర మథనం వల్ల, నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తీర ప్రాంతంలో జలజీవాల పునరుత్పత్తి బాగా దెబ్బతింటుంది. అంటే తీరానికి దగ్గరగా చేసే చేపల వేట దెబ్బ తింటుంది. ఇంతా చేసి ఈ ప్రాజెక్టు “మర్చంట్ పవర్ ప్రాజెక్టు” అంటే దీంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నాగార్జున కంపెనీ రాష్ట్రానికి ఇవ్వదు. ఖరీదుకట్టే షరాబును వెతుక్కుంటూ వెళ్తాయి ఈ సోంపేట విద్యుత్ వెలుగులు. కంపెనీ యజమానికి దండిగా కాసులు కురిపించే ఈ విద్యుత్ కేంద్రం స్థానికులకు మిగిల్చేది మాత్రం బూడిదా, చీకటీ మాత్రమే.

ఈ అమాయక ప్రజలు ఉంటారనే ఈ అభివృద్ధి గద్దలు ఇవ్వాళ శ్రీకాకుళంపై వాలాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అంబలి గాళ్ళు, వారేమి చేస్తారులే, వారి నాయకులు మన కాలికింద చెప్పులై వున్నారు కదా అన్న ఫాసిస్టు ఆలోచనతో తప్పుడు అవగాహనతో ఈ ప్రాంత వినాశనానికి పూనుకున్నారు. కానీ నేను ముందు చెప్పినట్లు ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కానే కాదు.. "అదిగదిగో ఉద్దానం..ఉద్దానం కాదురా ఉద్యమాల వనం రా" ఈ పాట ఇంకా సజీవంగానే ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పటిమను పునికిపుచ్చుకొని జమిందారి వ్యవస్థ మీద కంచు కంఠంలా దండయాత్ర చేసిన పోరు గడ్డ, అందుకే ఉద్యమం వారికి ఉగ్గు పాలతో పెట్టిన విద్య. ఈ ప్రాంత వాసులు ఎంత సౌమ్యంగా జీవనం కొనసాగిస్తారో, తెగిస్తే ఉప్పెనలా విరుచుకుపడగలరని సోంపేట ఉదంతంతో అర్థం ఐతుంది.

బ్రతుకుతెరువును హరించే ఈ కంపెనీ మాకొద్దంటూ సోంపేట పరిసర గ్రామాల ప్రజలు అనేక నెలలుగా ఉద్యమిస్తున్నారు. నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. కలెక్టర్ నుండి డిల్లీ పెద్దల దాకా అందరినీ కలిసి తమ గోడు వెలిబోసుకున్నారు. అయితే అభివృద్ధి టెర్రరిస్టులు ఏ మాత్రం  కనికరించకుండా ఏకంగా కాల్పులే జరిపిండ్రు. “అభివృద్ధి” కొరకు త్యాగాలు చేయాలని టీవిల ముందు సన్నాయి నొక్కులు నొక్కే లోక్ సత్తా జే పి లాంటి వారిప్పుడు “ఎవరి అభివృద్ధికి ఎవరు త్యాగం చేయాలనే” ప్రశ్నకు జవాబు చెప్పాలి.

ఆగష్టు 15 2010 న, మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన ప్రసంగం లో ఒక వ్యాఖ్య చేసిండు: 'మన దేశం లో అంతరంగిక భద్రతా సమస్యలు నక్సలైట్ల వల్ల బాగా పెరుగుతుంది, వీళ్ళను ఎరివేయ్యతానికి ఒక ప్రత్యేకమైన ఫోర్సు కావాలి'. మరి అదే నక్సలిసానికి అత్యంత మూల కారణమైన ఇటువంటి పెట్టుబడిదారి టెర్రరిస్టులను అంతమొందిన్చనీకి ఏ ఫోర్సు ఏర్పాటు చేస్తున్రు?

Wednesday, 9 June 2010

Telangana By Elections

కాంగిరేసోడి పీక గుంజితే...
టిడిపి బాబు డొంకా కదిలే...

మొదలైంది రెండు కళ్ళ లొల్లి...
మనం తెరవాలి మూడో కన్ను... 

అర్రే యేవ్వాడైతే ఏందిరా గోడ మీద పిల్లులే... 
తెలంగాణను దోచుకోనీకి తెగబడ్డ గద్దలే..
తెల్లా పంచె కాంగిరేసోడైనా..
పచ్చ కామెర్ల టిడిపి ఓడైనా..

తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే అని పోసులు గొట్టి 
అమరుల మీద మేము మాజీలమని ప్రమాణం చేసి

మంత్రి పదవుల కోసం మాటలు మార్చేటోల్లు
పట్టా భూముల కోసం పంగా నామాలు పెట్టేటోల్లు
శవాల మీద పేలాలు ఏరుకునే బిచ్చగాళ్ళు 
డబ్బు కట్టల కోసం సొల్లూ నాకే సన్నాసులు 
 
అర్రే జాతర పోదాం రాజన్న...వీల్ల పాతర ఏద్దాం ఎల్లన్న
పలుగు పట్టు పుల్లన్న..వీల్ల పాడే కట్టు మల్లన్న 
 
జాతర పోదాం రాజన్న...వీల్ల పాతర ఏద్దాం ఎల్లన్న 
పలుగు పట్టు పుల్లన్న..వీల్ల పాడే కట్టు మల్లన్న
 
అర్రే పిల్లీ గడ్డం మామ..యాడ బాయే నీ రెండో కన్ను 
అర్రే తకదిమితోం తయ్యం.. మాతో పెట్టుకోకు కయ్యం
జర్ర పుంగి బజాయేన్గే.. తు తెలంగాణ చోడ్కే జాన